అక్కడితో ఆగకుండా చంద్రబాబు ఓ మీడియా సమావేశంలో ఇక్కడ భూములు కొంటె తప్పేముంది.. కోనోద్దని ఎ చట్టంలో రాసి ఉందని అన్నారు.. ఇది దుమారం రేగగా తాజాగా ఇప్పుడు అదే తరహ మాటలు టీడీపీ నేత బొండా ఉమా కూడా చేయడం ఆసక్తి కరంగా మారింది.. ఏపీ రెవెన్యూ, క్రిమినల్ చట్టాలలో లేని ఇన్సైడర్ ట్రేడింగ్ను వైసీపీ నేతలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సెబీ కంపెనీ చట్టాల్లో ఉన్న ఇన్సైడర్ ట్రేడింగ్ను చూపించి అమరావతిని చంపాలని ప్రయత్నిస్తున్నారని బొండా ఉమా సరికొత్త విషయం చెప్పారు.
అయితే మొదటినుంచి ఈ విషయంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు, నిజాయితి గా ఉన్నాము అని టీడీపీ నేతలు చెప్తున్నారు.. తాము ఇంత నిజాయితి వంతులు అయితే టీడీపీ హయంలో అంత అవినీతి ఎలా జరిగింది ఎందుకు వారు జైలుకు వెళ్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేతలు.. ఎ తప్పు చేయకపోతే ఎందుకు విచారణను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లారు. అమరావతి భూ కుంభకోణంపై ఎలాంటి దర్యాప్తు జరగకుండా స్టేలు తెచ్చుకోని.. మళ్లీ నేడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పుకొస్తున్నారు.భూములు కొనకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలంటున్న బొండా ఉమా.. అలా భూములు కొనడం తప్పు కానప్పుడు ఎవరు..? ఎలాంటి విచారణ చేస్తే వచ్చే నష్టం ఏముంటుదని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారో ముందు చెప్పాల్సి ఉంటుంది.