శ్రీరస్తు-శుభమస్తు-ఆశీర్వమస్తు లేదా అవిఘ్నమస్తు అని ప్రస్తుత పెళ్లి ఆహ్వాన పత్రికలో మనం చూస్తుంటాం. దానికి భిన్నంగా 2 వ ప్రపంచ యుద్ధ సమయం లోని శుభలేఖ లో వ్రాసేవారు. అప్పటి పెళ్లి ఆహ్వాన పత్రిక చూస్తే దానిలో అప్పటి ఆర్థిక పరిస్థితి కూడా మనకి అర్ధం అవుతుంది. మనకి అప్పటి మే 9, 1946 న ప్రచురించిన ఆహ్వాన పత్రిక కనిపించింది. ఈ పత్రిక లో 'శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు' అని ఉండాల్సిన చోట, 'శాంతి-స్వాతంత్ర్యం-అభ్యుదయం' అనే జాతీయోధ్యమ నినాదాల తో ఆ పత్రికను ముద్రించారు. ఇది ఇలా ఉండగా ఆహ్వాన పత్రిక మొదటి లైన్ లో 'వందేమాతరం' అనే జాతీమోధ్యమ నినాదానం చూస్తుంటే 2వ ప్రపంచ యుద్ధం లో భారతదేశ ప్రమేయం, ఆ పరిస్థితుల్లో దేశంలోని పౌరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు.
'దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపలాని కోరుచున్నాం' అని ఆ ఆహ్వాన పత్రిక చివర్లో వ్రాసి ఉంది. దీని బట్టి ఆ సమయంలో ఆర్థిక పరిస్థితి ,నిత్యవసరాల కొరత వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడేవారో మనకి తెలుస్తోంది. ఇలా తాడంకి గ్రామం లో జరిగిన ఓ పెళ్లిలో ఇలా పెళ్లి పత్రకను ముద్రించి బంధువుల్ని, స్నేహితుల్ని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది.