అయితే కేవలం నేర చరిత్రను తగ్గించడమే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధిలో శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి కూడా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది యూపీ సర్కార్. ఓకే సమయంలో 2 వ్యూహాలతో ముందుకు సాగుతుంది.. ఓవైపు నేరాలపై ఉక్కుపాదం మోపుతూనే.. మరో వైపు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది . ఈ క్రమంలోనే ఇటీవల జపాన్ కంపెనీలను కూడా ఆకర్షించి.. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే.
ఇన్ని రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు సీఎం యోగి. ఇక ఇప్పుడు 600 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ పార్క్ గ్రేటర్ నోయిడా కు సమీపంలో ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ముంబై బేస్డ్ హీరణ్ ధని గ్రూప్ డేటా సెంటర్ పార్క్ ను సిద్ధం చేస్తుంది. 20 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఈ డేటా సెంటర్ పార్కు అవసరమైన కరెంటు ఉచితంగా సప్లై చేయడానికి యోగి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ఒకవేళ ఈ డేటా సెంటర్ పార్క్ శరవేగంగా పూర్త అయితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉండే ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.