ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కరెంటు చార్జీలు తగ్గించమని అడిగితే బషిర్ బాగ్ దగ్గర రైతులను పోలీసులతో కాల్పులు జరిపిన ఘనత చంద్రబాబు నాయుడుది అంటూ ఆరోపించారు. గుంటూరు లో జరిగిన ఘటన లో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని చెప్పారు..వారి మీద ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.. అమరావతిలో చంద్రబాబు నాయుడు , ఆయన బృందం కొన్న భూములకు రేటు పడిపోయిందని అమరావతి లో రైతులను అడ్డంపెట్టుకుని గోతికాడ నక్కల లాగా బతకాలని చంద్రబాబు నాయుడు, దేవినేని ఆయన బజన బృందం ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఇకపోతే చంద్రబాబు నాయుడు కరోనా భయం తో ఇంట్లో కూర్చుని , చేపల చెరువుకు , వరిచేనుకు తేడా తెలియని సన్నాసిని ,దద్దమ్మని పరామర్షకు పంపించాడని వాళ్ల పార్టీ నాయకులే చెబుతున్నారు.. అలాంటి లోకేష్ ముఖ్య మంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన బుద్ది చెప్తారు. లోకేష్ కొవ్వు పూర్తిగా కరిగింది.. కానీ కళ్లు నెత్తి మీద ఉన్నాయి.. వాటిని కూడా దించుతాము అంటూ నాని అన్నారు.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి.. టీడీపీ నేతలు ,కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..