అయితే బీజేపీ నేతలు హరీష్ రావు ని టార్గెట్ చేసిన సమయంలో కొంతమంది టిఆర్ఎస్ నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఉప ఎన్నికల ప్రచారం లో భారీగ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ బీజేపీ నేత లు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. అయినా సరే ఆయన కు మాత్రం కొంతమంది నుంచి సహాయ సహకారాలు అందటం లేదు. దీనిపై హరీష్ రావు కాస్త సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. పార్టీలో ఒకప్పుడు సన్నిహితంగా ఉన్నవారు కూడా ఇప్పుడే అలా సైలెంట్ గా ఉండటం పై హరీష్ రావు కాస్త అలిగినట్టు గా కూడా తెలుస్తుంది.
దీని వెనుక కారణం ఏంటి అనేది తెలియదు కానీ ఇప్పుడు కొంతమంది బీజేపీతో కలిసి తన మీద కుట్ర చేస్తున్నారని ఆయన నుంచి ఆవేదన వ్యక్తమవుతుంది. దీనిపై మంత్రి హరీష్ రావు కాస్త సీఎం కేసీఆర్ కి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ కోసం కొంతమంది కష్ట పడటం మానేసి ఇతర పార్టీల కోసం కష్టపడి పని చేస్తున్నారని దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా అలా పని చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన కేసీఆర్ ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.