ఈ క్రమంలోనే డి ఆర్ డి ఓ ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మోస్ మిస్సైల్ ని కనిపెట్టిన విషయం తెలిసిందే. అయితే డీఆర్డీవో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కి మొదట పరీక్ష జరిగి విజయవంతం అయింది. ఎంతో సమర్థవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది బ్రహ్మోస్ మిస్సైల్. కానీ బ్రహ్మోస్ మిస్సైల్ కి వేగాన్ని శక్తిని పెంచేందుకు డి.ఆర్.డి.ఓ మరింత సరికొత్త టెక్నాలజీని పొందుపరిచి మరిన్ని సార్లు పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మరోసారి బ్రహ్మోస్ మిసైల్ సత్తా చాటింది. ఇది భారత వాయుసేనకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. బ్రహ్మోస్ మిస్సైల్ మరోసారి ప్రయోగించి విజయవంతం అయ్యింది భారత వాయుసేన.
ఇక ఈ సారి ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఎంతో సమర్థవంతంగా కచ్చితత్వంతో ఛేదించింది బ్రహ్మోస్ మిస్సైల్. సుఖోయ్ 30ఎమ్కేఐ యుద్ధ విమానం ద్వారా ఈ బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగించారు. కాగా ఈ బ్రహ్మోస్ మిసైల్ ఎంతో సమర్థవంతంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రంలో ఉన్న నౌకలను ధ్వంసం చేసింది. పంజాబ్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన బ్రహ్మోస్ మిస్సైల్ గాలిలోనే ఇంధనం నింపుకుని దూసుకుపోయింది. ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బ్రహ్మోస్ మిస్సైల్ ఎంతో శక్తివంతంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేదించడం ఒక శుభపరిణామం అని చెప్పాలి.