ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. టీచర్ తిట్టిందనో లేదా ప్రేయసి మాట్లాడటం లేదనో  తల్లిదండ్రులు మందలించారనో  ఇలా చిన్నచిన్న కారణాలకే ఎంతో విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏకంగా తమ ప్రాణాలు తీసుకోవడమే కాదు కొన్ని కొన్ని సార్లు ఉన్మాదులు గా మారిపోయే సొంత వారి ప్రాణాలను కూడా తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఏదేమైనా క్షణికావేశం ఎంతోమంది ప్రాణాలను తీస్తూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంది. ఇక్కడ ఇలాంటి ఓ విషాదకర ఘటన జరిగింది. అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఏకంగా ఒక వ్యక్తి ప్రాణం తీసింది.




 అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం చెలరేగింది. అన్నదమ్ములు భూమి ఈ విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే మరోసారి అన్నదమ్ముల మధ్య భూ వివాదం తలెత్తింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వ్యక్తి క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా విషాదఛాయలు నింపింది. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక క్షణికావేశంలో ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో ఒక కుటుంబంలో తీరని విషాదం నిండిపోయింది.



 మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రెడ్డి తండాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు అనే వ్యక్తికి భూమి  పంపకాల విషయంలో తన తమ్ముడితో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజురోజుకీ గొడవలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రాజు తీవ్ర మనస్తాపం చెందాడు. మరోసారి తన తమ్ముడి తో గొడవ కావడంతో కఠిన నిర్ణయం తీసుకున్న ధరావత్ రాజు వంటగదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించినప్పటికే అప్పటికే ప్రాణాలు వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: