అందులోనూ కొందరు నేతలు విమర్శించే సమయంలో హెచ్చుతగ్గులు లేకుండా... తారతమ్యాలు మరచి విమర్శలు అడ్డూ అదుపు లేని స్థితికి చేరిపోతాయి. ఇలాంటి పదాలన్నీ మంత్రుల స్థాయిలో ఉన్న నేతలు కొందరు ప్రస్తావిస్తున్న సందర్భంలో జరుగుతూ ఉంటాయి. కానీ రాజ్యాంగబద్దమైన హోదాలో ఉండే ప్రజాప్రతినిధులు సైతం ఇదే తరహా మాటలు మాట్లాడుతున్నారని పలువురు ఆరోపిస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు..... ఇప్పుడు అదే లిస్టులోకి స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేరుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కూడా ఒకసారి పలు వివాదాస్పద వ్యాఖ్యల వలన స్పీకర్ తమ్మినేని సీతారాం హైలెట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో సారి సీతారం ఘాటుగా కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏది చేసినా విమర్శిస్తున్నారే...మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసారు...౩౦ లక్షల నిరుపేదలకు ఇల్లు లేకుండా చేసింది మీరు కాదా అని చంద్రబాబు ని సూటిగా ప్రశ్నించారు. ఇకనైనా అబద్ధపు మాటలు, అర్ధం లేని విమర్శలు మానండి అని టీడీపీ కి మరియు చంద్రబాబు కి హితవు పలికారు.