‘‘దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్దాలు మాట్లాడుతున్నారు. మన రాష్ర్టంలో 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం కేవలం 7 లక్షల మందికి మాత్రమే ఇస్తోంది. మనిషికి 200 మాత్రమే కేంద్రం ఇస్తుంది. సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లే. రాష్ర్టం రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లు ఇస్తుంది. బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలియాలి. వీటన్నిటిపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్క తీసి అధికారికంగా విడుదల చేసింది. ఆ లెక్కలన్నీ కాగ్ వద్ద ఉన్నాయి. ఒక వేళ నేను చెప్పేది అబద్ధమే అయితే.. ఎవడన్న మొగోడు వచ్చి రుజువు చేస్తే నేను ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతా. ఓట్ల కోసం బీజేపీ నాయకులు ఘోరమైన మోసాలు చేస్తున్నారు. వారికి నిజమైన ప్రేమలేదు.. ఓట్లు మాత్రమే కావాలి. ఈ మధ్యనే కేంద్రం వ్యవసాయ బిల్లు తెచ్చింది. గూండాగిరి చేసి మరీ బిల్లును ఆమోదించుకున్నారు’’ అని సీఎం కేసీఆర్ బీజేపీ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు.
‘‘దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్దాలు మాట్లాడుతున్నారు. మన రాష్ర్టంలో 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం కేవలం 7 లక్షల మందికి మాత్రమే ఇస్తోంది. మనిషికి 200 మాత్రమే కేంద్రం ఇస్తుంది. సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లే. రాష్ర్టం రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లు ఇస్తుంది. బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలియాలి. వీటన్నిటిపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్క తీసి అధికారికంగా విడుదల చేసింది. ఆ లెక్కలన్నీ కాగ్ వద్ద ఉన్నాయి. ఒక వేళ నేను చెప్పేది అబద్ధమే అయితే.. ఎవడన్న మొగోడు వచ్చి రుజువు చేస్తే నేను ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతా. ఓట్ల కోసం బీజేపీ నాయకులు ఘోరమైన మోసాలు చేస్తున్నారు. వారికి నిజమైన ప్రేమలేదు.. ఓట్లు మాత్రమే కావాలి. ఈ మధ్యనే కేంద్రం వ్యవసాయ బిల్లు తెచ్చింది. గూండాగిరి చేసి మరీ బిల్లును ఆమోదించుకున్నారు’’ అని సీఎం కేసీఆర్ బీజేపీ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు.