దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ఏమో గాని రాజకీయం మాత్రం ఆసక్తికరంగా మారింది.  ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న విమర్శలు ఒక రేంజ్ లో హీట్ పెంచాయి. తాజాగా ఆయన సిఎం కేసీఆర్ ని టార్గెట్ చేసారు. దుబ్బాక నియోజకవర్గం లోని దౌల్తబాద్ మండలం కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది అని ఆయన విమర్శించారు. దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి, దరిద్రపు ముఖ్యమంత్రి అంటూ ఆయన ఆగ్రహంగా వ్యాఖ్యలు చేసారు. మూర్కత్వపు ముఖ్యమంత్రి అని అన్నారు. కులాలు, వర్గాలతో ప్రజలను విడదీస్తూన్నారు అని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేయటంలేదు అని అన్నారు. విడదీయడం, చీల్చటం, కొట్లాటలు పెట్టడం ముఖ్యమంత్రి చేస్తున్న పని అని విమర్శించారు. 280 కోట్లు దుబ్బాక నియోజకవర్గానికి ఇచ్చాం, లేదంటే ఉరివేసుకుంటానని సవాలు చేసాను అన్నారు. దుబ్బకకు చర్చకు రమ్మని అంటే రాలే ని ఆయన విమర్శించారు. రేపు చర్చకు సిద్ధం.... నిరూపించకపోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ చర్చకు సిద్ధమా? అన్నారు. స్వచ్చ భారత్ పేరు కేంద్రం నిదులిచ్చింది అని ఆయన గుర్తు చేసారు.

 తెలంగాణాకు విమోచనానికి కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఈరోజు అని ఆయన అన్నారు. కనీసం నివాళులు అర్పించలేదు అని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఉరుకొమన్నారు. దుబ్బాక లో టీఆర్ఎస్ గెలవడం కేసీఆర్ కి ఇష్టంలేదన్నారు. దుబ్బకలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు అడ్డు తొలుగుతుందని,  దుబ్బాక లో ఓడిన తెల్లారి కొడుకును ముఖ్యమంత్రి చేస్తడు అని ఆయన విమర్శించారు. మొలతాడు లేని ఓవైసీ కి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన మండిపడ్డారు. మొలతాడు ఉన్న మేము తలుచుకుంటే ఏమైతావు? అని ప్రశ్నించారు.  కొమరం భీం కు టోపి పెట్టడం ఏంటీ రాజమౌళి? అని ప్రశ్నించారు. దుమ్ముంటే నీజాం రజాకార్ల కు బొట్టు పెట్టి తియ్యి సినిమా అంటూ సవాల్ చేసారు.  డైరెక్టర్ రాజమౌళి ని హెచ్చరిస్తున్న కొమురం భీం కి టోపీ ఉంటే సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తాం అన్నారు.బిడ్డ రాజమౌళి సినిమా రిలీజ్ చేస్తే.. బరిగలతో కొట్టి చంపుతామని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: