ఎపీలో మద్యం ధరలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా లీటర్ బాటిల్ పై 1350 రూపాయాల వరకు తగ్గింపు ఉంటుందని ప్రభుత్వం  ప్రకటించింది. ఎపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత మొత్తం మూడు సార్లు మద్యం ధరలు పెంచారు. 2019 కి ముందు 50 రూపాయలుగా ఉన్న చీప్ క్వార్టర్ ధర.. ఇప్పుడు 200 చేరుకుంది. అయితే తాజా తగ్గింపు జాబితాలో అత్యధికంగా అమ్ముడు పోయే ఈ రకాన్ని చేర్చలేదు. ధరల పెంపు ద్వారా తాగుడు తగ్గిస్తాం అని చెపుతున్న ప్రభుత్వం.. చీప్ విషయంలో ఆ కోణంలోనే నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ ఇప్పుడు ఇతర ప్రీమియం బ్రాండ్లతో పాటు చీప్ రేట్లు కూడా తగ్గిస్తే మళ్లీ తాగుడు పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. అయితే 30 శాతం సేల్స్ ఉండే  మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు మాత్రం తగ్గించింది. అయితే ఇంత తగ్గించినా పెద్దగా ఫలితం ఉండదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూడు సార్లు కలిపి 120 శాతం పెరిగితే.. ఇప్పుడు తగ్గింపు 50 లోపే ఉంటుదని తెలుస్తోంది.

ఎపీలో కరోనా ముందు రోజూ 30 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగేవి. అయితే కరోనా సమయంలో రేట్లు పెంచి షాపులు తిరిగి తెరినప్పుడు..రేట్ల ప్రభావం తీవ్రంగా కనిపించింది. సాధారణ రోజుల్లో 30 లక్షల కేసులు అమ్ముడైన చీప్ లిక్కర్ అమ్మకాలు.. తరువాత కాలంలో 12 లక్షల  కేసులకు పరిమితం అయ్యాయి. మద్యం ధరలు 75 నుంచి 100 శాతం పెరగడంతో పొరుగు రాష్ట్రం మద్యం పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వచ్చింది. దీంతో నెలకు 18 లక్షల ఆదాయం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయింది. ఆ తరువాత కాలంలో నిఘా పెరగడంతో చీప్ లిక్కర్ రవాణా కొంత మేర కంట్రోల్ లోకి వచ్చింది. అయితే ప్రీమియం బ్రాండ్ల రేట్లు ఎపిలో చాలా ఎక్కవగా ఉండడంతో ఆ తరహా మద్యం రవాణా మాత్రం తగ్గలేదు. ఇదే సమయంలో మూడు బాటిల్స్ తెచ్చుకోవచ్చని కోర్టు ఇచ్చిన తీర్పుతో గత రెండు నెలల్లో పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రం నుంచిమద్యం అధికారికంగా తెచ్చుకున్నారు. అయితే తాజాగా దానిపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రీమియం బ్రాండ్లపైనా రేట్లు తగ్గించింది. కానీ ప్రభుత్వం తగ్గించిన రేట్ల వల్ల అనూహ్యమైన మార్పు ఉండదని ఆ వర్గాలు చెపుతున్నాయి.

 ఇప్పటికీ తెలంగాణ కంటే ఏపీలో మద్యం ధరలు చాలా అధికంగా ఉన్నాయని చెపుతున్నారు. రేట్లు తగ్గించిన తరువాత కూడా ఒక్కో బాటిల్ పై గరిష్టంగా 700 వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. మరోవైపు పేరుకు అన్ని బ్రాండ్ల పేర్లు చెపుతున్నా..ఏపీలోని ప్రభుత్వ వైన్ షాపుల్లో అవి లభ్యం కావడం లేదు. దీంతో స్మగ్లింగ్ కొనసాగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. రేట్లు తగ్గించడం తో పాటు..అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తేస్తే మార్పు ఉంటుందని  ఆయా వర్గాల వారు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: