ఇంటి గుట్టు లంకకు చేటు అని ఒక సామెత ఉంది. అల నాడు విభీషణుడు రావణాసురుడి గుట్టు విప్పి మరీ రాముడికి చెప్పేయడంతో అంత లంక కూడా చాలా సులువుగా గెలిచేశారు. ఇపుడు టీడీపీ గుట్టు బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు చేతిలో ఉంది. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఏపీలో చంద్రబాబు సాటి అనుభవం ఉన్న నేత. గతంలో బీజేపీలో  పనిచేసిన వారి కంటే కూడా ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా చెప్పే స్వభావం సోము వీర్రాజుకే సాధ్యం. అందుకే ఆయన మీడియా ముందుకు వస్తే వైసీపీ మాట దేముడెరుగు టీడీపీ గుండెళ్ళో రైళ్ళు పరిగెడతాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన ఘాటుగా విమర్శిస్తారు. బాబుని అంత హార్ష్ గా విమర్శించే బీజేపీ  నేత సోము ఒక్కరేనేమో కూడా.

ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు చంద్రబాబు గురించి చాలానే చెప్పారు. సొంతంగా పోటీ చేసే ధైర్యం లేని చంద్రబాబు గతంలో ఎన్నో మార్లు సవాళ్ళు చేసి తరువాత చేతులు ముడుచుకున్నారని కూడా సోము హాట్ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి, ఎన్టీయార్ కి మోసం చేసిన వారు ఇపుడు ఆ పార్టీలో ఉన్నారని కూడా సోము అనేశారు.  నిజమైన ఎన్టీయార్ అభిమానులు ఉండాల్సిన చోటు బీజేపీ మాత్రమేనని కూడా సోము అంటున్నారు.

అలాగే 1984లో నాదేండ్ల భాస్కర రావు చేతిలో ఎన్టీయార్ అధికారం కోల్పోతే  ఆయన ఇక ఈ రాజకీయం చాలు అనుకున్నారట. దాంతో పూర్తి ఆవేదనతో  రాజకీయాల నుంచి విరమించుకుందామని ఎన్టీయార్ భావిస్తే ఆయన వద్దకు స్వయంగా వాజ్ పేయ్, అద్వానీ వంటి వారు వెళ్ళి మరీ రాజకీయాల్లో కొనసాగాలని గట్టిగా చెప్పి ధైర్యం నూరి పోసిన చరిత్రను కూడా సోము చెప్పారు.

టీడీపీలో నిజమైన ఎన్టీయార్ భక్తులు వినాల్సిన చరిత్ర ఇదేనంటూ ఆయన పాత గుట్టు విప్పారు. అంతే కాదు, ఎన్టీయార్ కుమార్తె పురంధేశ్వరికి బీజేపీలో పెద్ద పదవి ఇచ్చామని కూడా సోము అంటున్నారు. చంద్రబాబు టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని కూడా తేల్చేశారు. అందువల్ల టీడీపీ కార్యకర్తలంతా బీజేపీలో చేరాలని కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు సోము. మరి ఇది నిజంగా టీడీపీకి పెద్ద దెబ్బే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: