సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. డబ్బుతో ప్రజలను కొనేయాలని టిఆర్ఎస్ ప్లాన్ వేసుకుంది అని ఆమె ఆరోపించారు. రైతులను తన వైపు తిప్పుకోడానికే సిఎం మళ్లీ మాట్లాడుతున్నారు అని అన్నారు. భారతీయ జనతా పార్టీ ని జూటా పార్టీ అనడానికి హరీష్ కు సిగ్గుండాలన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా అబద్దాలు ఆడే మీరు బిజెపి ని విమర్శించడమా అని నిలదీసారు.


అబద్దాలతో అడుగడుగునా తెలంగాణ ప్రజలను మోసం చేసింది కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగమని చెప్పలేదని యాదగిరి గట్టపై ఒట్టేసి చెప్పండి అన్నారు. సిద్దిపేట దుబ్బాక రెండు కండ్లు అని ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. పచ్చి జూటా పోరులు మీరై బిజెపి ని విమర్శించడమా అని ఆమె ప్రశ్నించారు.  మరుగు దొడ్లుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే దారి మళ్లించిన ఘనులు మీరా బిజెపి కి చెప్పేది అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏదైనా నమ్ముతారని అబద్దాలు చెప్పడం దారుణమని అన్నారు.

రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారాయి.. కనీసం మేంటనెన్స్ చేయడం చేతగాలే అని ఆమె మండిపడ్డారు. రైతులకు మోటర్లకు మీటర్లని ఏ పేజీలో ఉందో హరీష్ రావు చూపించాలి అని ఆమె సవాల్ చేసారు. మోసాలు అబద్దాలు టిఆర్ఎస్ కె సాధ్యం.. మీరు చదివిందే అబద్ధపు స్కూల్ లో అని ఆమె ఎద్దేవా చేసారు. కరీంనగర్ లో మంత్రి పై ఎలా ఉందో మీరే చెప్పాలి అని ఆమె డిమాండ్ చేసారు. మీ మంత్రే నీచంగా ప్రవర్తించిన విషయం టివి లో చూస్తున్నాం అన్నారు. టిఆర్ఎస్ ఓటమికి నాంది దుబ్బాక నుంచే మొదలైందన్నారు ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: