ఇక కొన్నిచోట్ల మట్టి మాదిరిగా వదులుగా ఉండే రాళ్ళున్నాయి. అక్కడ మరమత్తులు చేయాల్సి ఉంటుంది. చిన్న రాళ్ళు ఉన్న చోట చైన్ లింకు మెష్ వేసి క్రాంక్ లు బిగించాలి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో సెన్సార్లను ఏర్పాటు చేస్తే ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అలారం మోగి ముందుగానే ప్రమాదం గుర్తించవచ్చని భావిస్తున్నారు. కొండ మీద ఎక్కడెక్కడ ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, ఎలాంటి ప్రమాదకర పరిస్థితులలో అవి ఉన్నాయనే విషయాలపై నిపుణుల బృందం పరిశీలన తర్వాత నివేదిక ఇవ్వనుంది. ఇప్పుడు ఈ నివేదక కూడ కీలకం కానుంది. దీని ఆధారంగానే రక్షణ చర్యలను కొండపై చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల దసరా ఉత్సవాలకు ముందు, దసరా ఉత్సవాల సమయంలో రెండు సార్లు కొండ చరియలు విరిగిపడి భక్తులను భయాందోళనకు గురిచేశాయి. ఇక ప్రభుత్వం కూడా ఉత్సవాల సమయంలో కొండరాళ్ళు జారి పడటంతో ఉలిక్కిపడింది.2006లో కొండ రాళ్ళు జారిపడకుండ కొండ చుట్టూ పలు చోట్ల 6 కోట్లు ఖర్చు పెట్టి ఇనుప వలలను ఏర్పాటు చేశారు. కానీ పెద్ద పెద్ద రాళ్ళు పడినపుడు ఈ వల ఆపలేకపోతోందని అధికారులు గుర్తించారు.