గిరిజన ప్రాంతాల్లో వివిధ రకాల విష జ్వరాలు అలాగే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి దోమతెరలు ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం అన్నారు. దోమతెరలను ఉపయోగించడం వల్ల దోమల కాటు నుంచి కాపాడుకోచ్చున్నారు. ప్రతి ఏటా గిరిజనులకు దోమ తెరలను పంపిణీ చేస్తున్నా కొంత మందికి వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో వాడకుండా బీరువాల్లో మూసిపెట్టుకుంటున్నారన్నారు.. ఈ కారణంగానే అనేక కుటుంబాలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు ఐటీడీఏ జిల్లాల పిధిలో పరిధిలో ఉన్న 25 లక్షల 16 వేల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో దోమ తెరలను పంపిణీ చేస్తున్నట్లు పుష్ప శ్రీవాణి తెలిపారు. ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దోమతెరల వినియోగం, దోమల మందు పిచికారీ విషయంలో గిరిజనుల్లో అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వినూత్నమైన రీతిలో కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో వివిధ రకాల విష జ్వరాలు అలాగే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి దోమతెరలు ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం అన్నారు. దోమతెరలను ఉపయోగించడం వల్ల దోమల కాటు నుంచి కాపాడుకోచ్చున్నారు. ప్రతి ఏటా గిరిజనులకు దోమ తెరలను పంపిణీ చేస్తున్నా కొంత మందికి వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో వాడకుండా బీరువాల్లో మూసిపెట్టుకుంటున్నారన్నారు.. ఈ కారణంగానే అనేక కుటుంబాలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు ఐటీడీఏ జిల్లాల పిధిలో పరిధిలో ఉన్న 25 లక్షల 16 వేల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో దోమ తెరలను పంపిణీ చేస్తున్నట్లు పుష్ప శ్రీవాణి తెలిపారు. ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దోమతెరల వినియోగం, దోమల మందు పిచికారీ విషయంలో గిరిజనుల్లో అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వినూత్నమైన రీతిలో కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.