దేశం లో మహిళల పై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వం , పోలీసులు కట్టడి చేయడానికి ప్రయతిస్తున్నా కూడా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.. మహిళలు తమ మాన ప్రాణాలను కాపాడు కోవడానికి శాయశక్తులా ప్రయత్నించి చివరికి ప్రాణాలను సైతం వదిలేస్తున్నారు.. ముఖ్యంగా బెదిరింపులకు గురవుతున్నారు.. అదేంటంటే ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో ను తీశాడు..దాన్ని సోషల్ మీడియా లో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. శారీరక సంబంధం కోసం ప్రయత్నించాడు.. అతడి ఆగడాలు ఎక్కువ కావడం తో పోలీసులను ఆశ్రయించింది..



ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.కాన్పూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ అత్తమామలతో కలసి నివసిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం ఢిల్లీలో ఉంటున్నాడు. ఆమె ఇంటికి సమీపంలో నివాసముంటున్న యువకుడు రోహిత్ అలియాస్ బాబు ఆమెపై కన్నేశాడు. ఆమె బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలో పైనుంచి వీడియో తీశాడు. రాత్రివేళ ఆమె ఇంట్లోకి చొరబడి వీడియోతో బ్లాక్‌మెయిల్ చేశాడు. తన తో శృంగారం చేయకుంటే వీడియో ను సోషల్ మీడియా లో పెట్టీ వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు..



ఆమె అందుకు నిరాకరించడంతో  తలకు గన్ గురిపెట్టి దారుణానికి పాల్పడ్డాడు..ఆమెను అమానుషంగా అత్యాచారం చేశాడు. బాధితురాలు విషయం తన భర్తకి చెప్పడం తో ఆయన ఢిల్లీ నుంచి గ్రామానికి వచ్చాడు. బాధితురాలితో కలసి స్థానిక పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడ పరాభవం ఎదురైంది. పోలీసులు పట్టించుకోక పోవడంతో దంపతులు కోర్టుని ఆశ్రయించారు.. పోలీసులు ఈ కేసును ముందుకు తీసుకెళ్లక పోవడంతో తీవ్ర ఆవేదనకు గురి అయినట్లు తెలుస్తుంది.. కోర్టు వారి ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే ఈ విషయం పై సీరియస్ గా తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.. దీంతో నిందితుడికి శిక్ష పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: