తిరుమలకు చేరుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకుని పునీతులవుతు ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఇటీవలె తిరుమలలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏకంగా తిరుమల చేరుకుని ఒక భక్తుడు చివరికి కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఏకంగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో బలవన్మరణానికి పాల్పడటం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఏం కష్టం వచ్చిందో ఏమో ఏకంగా శ్రీవారి సమక్షంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సదరు భక్తుడు.
తిరుమల వకుళమాత అతిథిగృహంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఏకంగా అతిథి గృహంలోనే ఉరివేసుకొని చనిపోవడం అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. మృతుడు హైదరాబాద్ మల్కాజిగిరి కి చెందిన శ్రీధర్ గా గుర్తించారు పోలీసులు. ఇక వెంటనే సదరు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా శ్రీధర్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ట్లు పోలీసులు గుర్తించారు. శ్రీధర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అనే విషయంపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.