ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసును ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం కూడా అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసును ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం కావడానికి ఆలస్యం అయినప్పటికీ ఎట్టకేలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు రవాణా కష్టాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
తమిళనాడుకు కూడా బస్సు లు ప్రారంభించాలని ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది ఈనెల 25వ తేదీ నుంచి తమిళనాడుకు కూడా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ. ఈనెల 25వ తేదీ నుంచే తమిళనాడులోని చెన్నై కి బస్సులు ప్రారంభించనున్న ఏపీఎస్ఆర్టీసీ... ఆంధ్రప్రదేశ్లోని పలు డిపోల నుంచి ఈ బస్సు సర్వీసులను తమిళనాడుకు తిప్పనుంది. ముందుగా తక్కువ సంఖ్యలో మాత్రమే బస్సు సర్వీసులు ప్రారంభించనున్న ఏపీఎస్ఆర్టీసీ ఆతర్వాత పరిస్థితులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.