ఈ క్రమంలోనే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలమీదికి కూడా తెచ్చుకున్నారు.కాగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టడంలో విజయవంతం అయిందని అధికార పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ ప్రభావం పై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అందరికీ హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు ఆయన. కరోనా నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు అంటూ సూచించారు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించిన నేతలు కార్యకర్తలు అందరూ మాస్కులు ధరించడం తో పాటు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.