దేశంలో మహిళల పై జరుగుతున్న లైంగిక దాడులను ప్రభుత్వాలు కంట్రోల్ చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా ఆగడం లేదు.. ఎప్పుడూ ఎక్కడో చోట దాడులు , అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి..బయట వాళ్ళ నుంచి వారిని కాపాడటం పోలీసులకు పెద్ద పని కాదు.. కానీ ఇంట్లో వాళ్ళే వాళ్ళని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు.. అలాంటి ఘటనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న కన్న తండ్రే కూతురును బెదిరించి పలు మార్లు అత్యాచారం చేశాడు.. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.



వివరాల్లోకి వెళితే.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కామంతో చెరచాలని వావీవరసలు మరచి మరీ బరితెగిస్తున్నారు. భోజనం పెడుతున్న కూతురిపై కామంతో నీచానికి పాల్పడిన దారుణ ఘటన యాదాద్రి భువనగిరిలో జరిగింది. జిల్లాలోని మోత్కూరుకు చెందిన ఆటో డ్రైవర్‌కి భార్య, నలుగురు కూతుళ్లు సంతానం. విభేదాల కారణంగా భార్య 17 ఏళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. రెండేళ్ల కిందట వారి మూడో కూతురు చనిపోయిందని తెలియడంతో భార్య తిరిగి ఇంటికి వచ్చింది..అప్పటి నుంచి భార్య భర్తలు కలిసే ఉంటున్నారు..




అయితే మళ్లీ ఇద్దరు మద్య గొడవలు జరుగుతున్నాయి.. దాంతో పాటుగా ముందుకన్నా ఎక్కువగా ఇద్దరు గొడవలు పడుతూ పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.మళ్లీ భార్యాభర్తల నడుమ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాలుగో కూతురు తండ్రికి భోజనం పెట్టేందుకు ఉపక్రమించింది. ఆ సమయంలో కీచకుడిగా మారిన తండ్రి భోజనం పెడుతున్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్నకూతురిపై అత్యాచారయత్నం చేశాడు. కూతురు అతని దురాగతాన్ని ఎదుక్కోడంతో తన ఆలోచన మానుకున్నాడు..ఈ విషయం ఎవరికైనా చెబితే ఇంట్లో నుంచి వెళ్లగొడతానంటూ బెదిరింపులకు దిగాడు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తండ్రి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: