ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. అంత సాఫీగా సాగిపోతున్న సంసారంలో పరాయి వ్యక్తి ప్రవేశించాడు దీంతో ప్రియుడి మోజులో పడిన భార్య తన సుఖానికి భర్త అడ్డు వస్తున్నాడు అని అనుకుంది. దీంతో భర్త ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నది . ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని జంషెడ్పూర్ లో వెలుగులోకి వచ్చింది. జంషెడ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఈ క్రమంలోనే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో సదరు వ్యక్తి భార్య అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
భర్తకు తెలియకుండా ఎన్నో రోజుల పాటు రాసలీలల్లో మునిగి తేలుతూ వచ్చారు. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను తీరు మార్చుకోవాలి అంటూ హెచ్చరించాడు. ఇక అప్పటినుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇటీవలే తీరు మార్చుకోకుండా ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తున్న భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త మరోసారి గొడవ పడ్డాడు. గొడవ మరింత తీవ్రంగా మారిపోయింది. కాగా తన సుఖానికి అడ్డు వస్తున్న భర్తను అంతమొందించాలి అనుకున్న భార్య భర్త నిద్రిస్తున్న సమయంలో ఆహారంలో విషం కలిపి పెట్టింది. తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయింది. స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.