ఈ మధ్య కాలంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. క్షణకాల సుఖం కోసం మానవ సంబంధాలను మరుస్తున్న మనుషులు దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన జరిగింది. ఏకంగా పిల్లలకు పెళ్లి చేయాల్సిన వయసులో పెద్దల మధ్య ప్రేమ చిగురించింది. అది కూడా పెళ్లి కూతురు తల్లితో పెళ్లి కొడుకు తండ్రి ప్రేమ వ్యవహారం కాస్త అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతుంది అనుకుంటున్న తరుణంలో పెళ్లి కూతురు తల్లి పెళ్లి కొడుకు తండ్రి పారిపోయిన ఘటన జార్ఖండ్ లో వెలుగులోకి వచ్చింది.



 ఈ ఘటన మానవ సంబంధాలకు మాయని మచ్చగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మారిపోయింది. ఇక్కడ ఇరు కుటుంబాలు సమ్మతం తో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి వివాహ వేడుకకు బంధుమిత్రులు అందరూ హాజరయ్యారు ఇక మరి కొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతుంది. అంతలో  ఊహించని షాక్ తగిలింది. ఏకంగా  వధువు తల్లి వరుడు తండ్రి పరారయ్యారు. దీంతో పెళ్లి కాస్త ఆగిపోవడమే కాదు బంధుమిత్రులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. గురువారం పెళ్లి జరగాల్సి ఉండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబసభ్యులు మునిగిపోగా అప్పుడే.. ఊహించని విధంగా వధువు తల్లి అదృశ్యమైంది.



 దీంతో పోలీసులకు వధువు తరపు బంధువులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఇక అదే సమయంలో వరుడు తండ్రి కూడా కనిపించకపోవడం మరింత చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక ఇటు వరుడు తరపు కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఆ తర్వాత అటు పోలీసులు కూడా విచారణ ప్రారంభించిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆ ఇద్దరూ కలిసి ప్రేమించుకుని పారిపోయి ఉంటారని ప్రస్తుతం బంధువులు భావిస్తున్నారు. ఇక పెద్దలు  కాస్త బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానవ సంబంధాలను మంట  కలిపి ప్రేమ పేరుతో పారిపోవడంతో... పెళ్లి కాస్త ఆగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: