ఏపీలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు రాష్ట్ర సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎపీకి అన్యాయం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. జగన్, విజయ సాయి రెడ్డి తీరు పై మండిపడ్డ టిడిపి సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు... తీవ్ర విమర్శలు చేసారు. పాదయాత్ర లో అడుగుడుగునా అబద్దాలు చెప్పావు అని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి సి.ఎమ్ అయ్యావు..అయినా నీ పద్దతిమారలేదు అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, పెంచడం అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? అని నిలదీశారు.

అలా చేస్తే ప్రజలు సహించరు.. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు అని విమర్శలు చేసారు. విజయ సాయి రెడ్డి శకుని మామ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఆయన్ను నమ్మవద్దని జగన్ కి అయ్యన్న సలహా ఇచ్చారు. ఇరిగేషన్ కి చేతకాని మంత్రిని పెట్టారు అన్నారు. అయనకు ఇరిగేషన్ మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా? అని నిలదీశారు. ప్రభుత్వం చేతగానితనం వలన  నాటు సారా తయారు అవుతుంది అని మండిపడ్డారు. అమ్మఒడి లో డబ్బులు వేసి... నాన్న ఒడి నుంచి తీసుకుంటున్నావు అని మండిపడ్డారు.

ఎన్ని సార్లు మాట తప్పారో..ఎన్ని సార్లు మడమ తిప్పారో జగన్ ఆలోచించుకోవాలి అని ఆయన సూచించారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి మీ పార్టీ నేతలు దోచుకునేందుకు అవకాశమిచ్చావు అని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపావు అని విమర్శలు చేసారు. రోడ్లు బాగుచేసేందుకు పెట్రోలు,డీజిల్ ధరలు పెంచావు అన్నారు. కట్టిన ప్రభుత్వ ఇళ్లు  లబ్దిదారులకు ఇవ్వకుండా ఆపేశావు అని విమర్శించారు. ఇళ్లపట్టాల పంపిణీ పేరుతో భూదోపిడీలకు పాల్పడుతున్నావు అని  మండిపడ్డారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంటలరుణపథకం ప్రారంభించి మరోసారి రైతుల్ని మోసం చేస్తున్నావు..ఇది బోగస్ పథకం అన్నారు ఆయన. 18 నెలల్లో ప్రజలు ఎన్నికష్టాలు పడ్డారో నీకు తెలుసా అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: