హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో కారు బీభత్సం సృష్టించింది .. కారు ఢీకొన్న దుర్ఘటనలో తల్లి కూతురు అక్కడిక్కడే మృతి చెందారు .. ఈ ప్రమాదం హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ రింగ్ రోడ్ సమీపంలో జరిగింది..వివరాలలోకి వెళ్తే ,

అబ్దుల్లాపూర్ మెట్ లోని కోహెడ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది .. రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని వెనక నుండి గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో వాహనం లో ఉన్న తల్లి కూతరు తీవ్రంగా గాయపడ్డారు మరియు అక్కడిక్కకడే మృతి చెందిన ఘటన తీవ్రంగా కలిచి వేసింది ..  ..వారితో పటు  కారులోని మరో  ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ..

వెనక నుండి వేగంగా  ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయియ్యింది .. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు .. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు తల్లి కూతుళ్ళ మృతదేహాలను పోస్టుమాత్రం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు .. ప్రమాదం పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ..
ఈ ఘటనపై సంబంచిన పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు ..  ఇంకా తెలియవలసి ఉందని పోలీసులు అంటున్నారు .. హైదరాబాద్ ఔటర్ రింగ్  రోడ్లపై ప్రమాదాలు జరగడం కొత్త విషయమేమి కాదు .. ప్రమాదం జరగకపోవడం కొత్త విషయం .. ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదాల నివారణ సూచనలు చెప్పిన ప్రమాదాలు సంభవించడం జరుగుతుంది .. ఇలా ప్రమాదాలు జరగడం పై ప్రభుత్వం కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు .. ప్రమాదాలపై చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి ..  

హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్లు యమపురి కి దారిలాగా దర్శనమిస్తున్నాయి ..ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ పైకి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు .. హైదరాబాద్ లోని మాములు రోడ్డులకు ,ఔటర్ రింగ్ రోడ్డులకి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది .. రెండింటిలో వ్యత్యాసం చుస్తే ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదం జరిగితే మరణ శాతం అధికం అని తెలుస్తుంది ..   

మరింత సమాచారం తెలుసుకోండి: