బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ కత్తి కార్తీక బీజేపీ లో చేరనున్నారా .. అసలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలవడానికి  కారణం ఏమై ఉంటుంది ..గ్రేటర్ ఎన్నికలలో  బిజెపి తరపున కత్తి కార్తీక  నిల్చోనున్నారా ... అసలు భేటీకి అసలైన కారణం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మందిని సెలబ్రెటీలు చేసింది .. ఇప్పటికి బిగ్ బాస్ వస్తున్నా దానిని చూసే ఫాన్స్ కొన్ని లక్షల్లో ఉంటారు .. అలాంటిది  బిగ్ బాస్ సీజన్  1  జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమైన షో లో కత్తి కార్తీక పాల్గొన్నారు ..ఆ షో ద్వారా కత్తి కార్తీక చాలా ఫేమస్ అయ్యింది .. ఇప్పుడే అదే ఫేమ్ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ..

మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కత్తి కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది ..పెద్ద పెద్ద పార్టీల అభ్యర్థులు మధ్య ఆమె పోటీ చేయడం ప్రత్యేకం ..దుబ్బాక లో జరిగిన ఉపఎన్నికల్లో ఆమె పరాజయం చవి చూసింది ...కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు .. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సెలబ్రెటీ రాజకీయాలకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది .. ఈ సందర్భం లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ని కత్తి కార్తీక మర్యాద పూర్వకంగా కలిసింది ..

అయితే గ్రేటర్ ఎన్నికల  నేపథ్యం  లో కార్తీక కిషన్ రెడ్డి ని కలవడం  హాట్ టాపిక్ గా మారింది ..ఈ భేటీలో కార్తీక బిజెపి లో చేరబోతున్నట్లు సమాచారం వినబడుతున్న అందులో  నిజం లేదని తెలుస్తుంది .. అయితే కత్తి కార్తీక బిజెపి లో చేరుతుందా లేదా అని ఏదైనా ఒక ప్రకటన రెండు రోజుల్లో వెల్లడిస్తామని ప్రచారం కూడా  జరుగుతుంది  .. దీంతో కత్తి కార్తీక మరోసారి హైలెట్ గా నిలిచింది .. 

మరింత సమాచారం తెలుసుకోండి: