టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్ షీట్ విడుదల చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్... తెరాస ప్రభుత్వ టార్గెట్ గా విమర్శలు చేసారు. బీజేపీ మేయర్ కావాలా.. ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలని కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్   అన్నారు. హైద్రాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతోంది అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. కేంద్ర నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుంటోందని ఆయన ఆరోపణలు చేసారు.  కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్ ను కాపడుకోవాలి అని ఆయన అన్నారు.

కేసీఆర్ కేటీఆర్ లు.. అసదుద్ధీన్  అక్భర్ కోసం రాజకీయాలు చేస్తున్నారు అని ఆయన విమర్శలు చేసారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ కు ఓటు వేస్తె ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని ఆయన అన్నారు. కేటీఆర్, హరీష్, కేసీఆర్ మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతోంది అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ ఆరేళ్ళల్లో పాలన అవినీతికి చిరునామా  అన్నారు ఆయన. హైద్రాబాద్ ను డల్లాస్ నగరం చేస్తామని.. కేటీఆర్ వరదల‌ నగరంగా మార్చారని మండిపడ్డారు.

లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అని విమర్శలు చేసారు. మోదీ రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తే.. కేసీఆర్ రెండు వందల ఇళ్ళు కూడా నిర్మించలే అని ఆయన మండిపడ్డారు. హుస్సేస్ సాగర్ లో ఉన్న కొబ్బరినీళ్ళు కేసీఆర్ తాగుతున్నారా? అని ఆయన విమర్శించారు. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడు అని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ పాత్రలో బీజేపీ పాత్ర కీలకం.. సుష్మా స్వరాజ్ లేకోయినా ఆమె పోరాటం మర్చిపోలేం అని ఆయన కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: