జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు.ఎవరికి వారు తమ దూకుడు చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.ఏంఐఏం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశాడు.తలుచుకుంటే టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మజ్లిస్ చార్మినార్ ఎమ్మెల్యేముంతాజ్ అహ్మద్ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.ముంతాజ్ అహ్మద్ ఖాన్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నారాయి..

 మేము తలుచుకుంటే రెండు నెలల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆయన అన్నారు. కేటీఆర్ ‘చిలక’ అని పేర్కొన్న ఆయన కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లో కళ్ళు తెరిచాడని అన్నారు. మా అధినేత చెప్పినట్టు రాజకీయం మా ఇంటి గుమస్తా తో సమానం అంటూ ఆయన ఈ కామెంట్స్ చేశారు..

 నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలకు ఎంఐఎం పార్టీ  మద్దతు ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని టీఆర్ఎస్, ఎంఐఎం గతంలో ప్లాన్ చేశాయి.మరి ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ ఎన్నికల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడంతో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: