నారా లోకేష్ ఈమధ్య చాల హడావుడి చేస్తున్నాడు. కరోనా సమయంలో పెద్దగా కనిపించకపోయినా ఇప్పుడు ప్రజల్లోకి బాగానే దూసుకువెళ్లిపోతున్నాడు. టీడీపీ భవిష్యత్ లీడర్ గా ఎదిగేందుకు లోకేష్ చాల కష్టపడుతున్నారు కానీ ప్రజలు ఎలాంటి తీర్పు చెప్తారో.. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే లోకేష్ టీడీపీ అధికారంలో ఉన్నపటికంటే ఇప్పడే ఎక్కవుగా పాపులారిటీ పెంచుకుంటున్నాడు.గడచిన పది నెలల లోకేష్ వేరు. మూడు నెలల లోకేష్ వేరు అని అంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమితో పాటు నేతల నైరాశ్యం కూడా లోకేష్ ను ఆలోచనలో పడేశాయి అందుకే కొంత టైం తీసుకుని లోకేష్ ప్రజలోకి వెళుతున్నారట.. నిజానికి అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షాలో ఉన్నప్పుడే ఓ నాయకుడి సత్తా తెలుస్తుంది..

అదే సూత్రం ఇక్కడ లోకేష్ కి వర్తిస్తుంది. టీడీపీ కి ఓ కొత్త నాయకత్వం అవసరమున్న వేళా ఇలా లోకేష్ దూకుడు ఆ పార్టీ నేతలకు మంచి న్యూస్ అవుతుంది. లోకేష్ ఇప్పటివరకు నేరుగా రాజకీయాలకు ఎప్పుడు దిగలేదు. ఇదే తొలిసారి ప్రజలోకి రావడం. 2014 ముందు వరకూ ఆయన వెనక ఉండి నడిపించారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన లోకేష్ కు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన తక్కువేనని చెప్పాలి. ఆయన పార్టీ ముఖ్యనేతలు, ఆయన సన్నిహితులు అందించే సమాచారం తప్ప ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. దీంతో ఆయన హైఫై నేతగానే మిగిలిపోయారు.

2014 లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కావడం, వెను వెంటనే మంత్రి కావడం కూడా లోకేష్ కు మైనస్ అయింది.దాంతో అధికారంలో ఉంటే ప్రజల మద్దతు లేని వ్యక్తి ముఖ్యమంత్రి కూడా అయిపోవచ్చు అనే వాదనను ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లి లోకేష్ ని కావలిసినంత బ్యాడ్ చేశాయి. ఎన్నికల్లో ఓడిపోవడం కూడా లోకేష్ ని కృంగదీశాయి. అందుకే పార్టీపై పట్టు పెంచుకునే ప్రయత్నమూ లోకేష్ చేయలేదు. అందుకే ఆయన జిల్లా పర్యటనల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయిన సందర్భాలున్నాయి.అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లోకేష్ లో స్పష్టమైన మార్పు వచ్చింది. ప్రసంగాల్లో సయితం పరిణితి కన్పిస్తుంది. ట్విట్టర్ కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పార్టీలో పట్టు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.లోకేష్ లో వచ్చిన మార్పు టీడీపీలోనే చర్చనీయాంశమైంది. ఆయనను తమ నాయకుడిగా అంగీకరించేందుకు ఇప్పుడు టీడీపీ నేతలు పూర్తిగా సిద్దమయినట్లే కన్పిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: