గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారాన్ని బిజెపి నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రచారంలో ప్రజల్లోకి వెళ్ళడానికి గానూ అనేక కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారు. అనేక కార్యక్రమాలను సిద్దం చేసి పెట్టుకున్న బిజెపి నేతలు తెరాస ను ఇబ్బంది పెట్టడానికి బస్తీ ప్రాంతాలను ఎక్కువగా టార్గెట్ చేసారు. ఇక రాజకీయంగా గ్రేటర్ పరిధిలో తమకు అనూలంగా అవకాశాలను మార్చుకోవడానికి వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేసారు.

రేపు బీజేపీ ‘బస్తీ నిద్ర’ ఉంటుంది అన్నారు. టెలికాన్ఫరెన్సులో నాయకులకు దిశా నిర్దేశం చేసారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించారు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ఇంఛార్జీలతో సోమవారం ఉధయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన శ్రీ బండి సంజయ్  ‘బస్తీ నిద్ర’ ప్రాధాన్యతను వారికి వివరించారు.

ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో తనతోపాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వీలైనంత మేరకు ‘బస్తీ నిద్ర’ చేస్తామని ఆయన వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రేపు తాను ‘బస్తీ నిద్ర’ చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. బస్తీ నిద్ర’ కార్యక్రమంలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేయాలని, బస్తీల్లో ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారితో మమేకం కావాలని ఆయన సూచించారు. బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తరువాత కూడా ‘బస్తీ నిద్ర’ కార్యక్రమాన్ని వారానికి ఒక రోజు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి క్రుషి చేస్తారనే విషయాన్ని‘బీజేపీ బస్తీ నిద్ర’ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp