తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది ఇప్పుడు వేరే పార్టీ లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా అవకాశాలు లేవు అనే విషయం స్పష్టంగా చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని సార్లు తాము అధికారంలోకి వస్తాము అని చెప్తున్నా సరే ఆ విధంగా పరిస్థితి మాత్రం కనబడడం లేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అసలు కనబడటంలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని వార్తలు కాంగ్రెస్ పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. రేపు విజయశాంతి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ఆమె... కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడుతో కూడా ఆమె సమావేశం కానున్నారు. రేపు ఆమె బిజెపిలో చేరే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత రానుంది.