జిహెచ్ఎంసికి సమగ్ర చట్టం తెస్తాం అని ఆయన అన్నారు. మిషన్ భగీరథ తర్వాత 24గంటలు మంచినీటి సరఫరా చేస్తాం అని హామీ ఇచ్చారు. జంట నగరాల్లో డిసెంబర్ నుంచి నీటి బిల్లులు ఉండవు అని ఆయన అన్నారు. 20వేల లేటర్లు ఉపయోగించుకునే వారికి ఉచిత నీటి సరఫరా చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. దాని వల్ల 97శాతం ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. నాలుగు మాసాల తర్వాత రాష్ట్ర వ్యాప్త మున్సిపాలిటీల్లో కూడా ఉచిత నీటిసరఫారాకు చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు.
ఢిల్లీ లో ప్రస్తుతం ఇది అమలులో ఉంది. మన రాష్ట్రం రెండోది అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల కటింగ్ సెలూన్ లకు డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్ అని వివరించారు. రజకుల లాండ్రీ, దోబీ ఘాట్ లకు కూడా ఉచిత విద్యుత్ అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి 52740 కోట్ల నష్టం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు 6మాసాల విద్యుత్ చార్జీ రద్దు అని హామీ ఇచ్చారు. మోటార్ వాహనాలు,టాక్సీ లు, క్యాబ్ లకు రెండు త్రైమాసికాల టాక్సీ రద్దు చేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు.