ఈ మధ్య కాలంలో కుటుంబాల్లో ఉన్న కలహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. ఈ ఘటనలు అసలు ఎటు వెళ్తున్నాయి ఏంటీ అనేది భయపెడుతున్నాయి. కుటుంబాలను కనీసం పట్టించుకోకుండా కొంత మంది వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. వెనుకా ముందు ఆలోచన లేకుండా కొంత మంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తమ ఇష్టాలే గాని ఒక కుటుంబం ఉన్న సమయంలో ఆ కుటుంబాన్ని పట్టించుకుని ముందుకు వెళ్ళడం లేదు.

దీని వలన నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అక్రమ సంబంధాలు కూడా ఇప్పుడు కాస్త జీవితాలను నాశనం చేస్తున్నాయి. పెళ్లి అయిన తర్వాత కూడా మరో పెళ్లి మీద కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. దీని వలన చిన్న చిన్న పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి అనే భావన ఏర్పడుతుంది. ఇక ప్రేమించి చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న వారు అయితే ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పాలి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఘటన కన్నీరు పెట్టించింది.

ఒక వ్యక్తి చేసిన పనికి కుటుంబం మొత్తం నాశనం అయింది అనే చెప్పాలి. ఒకే  కుటుంబానికి చెందిన నలుగురు  ఉరివేసుకొని  ఆత్మహత్య చేసుకున్నారు రాజమండ్రిలో. ఆత్మహత్య కు పాల్పడిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తల్లి, కూతురు మనవలైన , ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడకు చెందిన భర్త నాగేంద్ర కుమార్ రెండో పెళ్ళి చేసుకున్నాడని మనస్తాపం చెంది, రోడ్డున పడిన కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. సంగిశెట్టి కృష్ణవేణి ( 55), భూపతి శివపావని (27), భూపతి నిషాన్  (9), భూపతి రితికా  (7) మృతి చెందారు అని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: