గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు కాస్త దూకుడుగా ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేసారు. విజయశాంతి రేపు బీజేపీలో చేరుతున్నారన్న డీకే అరుణ... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరతారు అని ఆమె అన్నారు. అనేక మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారు అని ఆమె చెప్పుకొచ్చారు. తన పదవి కాపాడుకోవటానికే ఉత్తమ్ తన చెంచాలతో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు అని మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్ లు ఇంటర్నేషనల్ దొంగలు అని ఆమె ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని కేసీఆర్ చూసి రావాలి అన్నారు.  కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న కేసీఆర్ కలలు నెరవేరవు అని ఆమె పేర్కొన్నారు. కొత్త సీసాలో పాత సారాయి తరహా.. టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంది అని ఆమె వ్యాఖ్యానించారు. మన అనే పదమే కేసీఆర్ కు సూటు కాదు అని, నా నగరం.. నా పార్టీ.. నా పాలన అంటే బాగుండేది అని ఎద్దేవా చేసారు. బీజేపీ బలం చూసి మంత్రి కేటీఆర్ పరేషాన్ లో ఉన్నాడు  అని ఆమెఎద్దేవా చేసారు.

ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ ముస్లింలను మోసం చేస్తున్నాడు అని మండిపడ్డారు. పాతబస్తీ అధ్వానంగా మారటానికి ఎంఐఎం పార్టీనే కారణం అని ఆమె విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ళు కావాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు అని ఆమె అన్నారు. టీఆర్ఎస్ ఎంఎల్ఏలు, కార్పోరేటర్లు కూడా కేసీఆర్ మాదిరి ప్రజలను కలవరు అని ఆమె వ్యాఖ్యానించారు. మజ్లీస్ కు ఓటు వేస్తే.. టీఆర్ఎస్ కు ఓటు వేసినట్లే అని అన్నారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు,  బైంసా ఘటనపై కేసీఆర్ ఎందుకు మాట్లాడరు అని ఆమె మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య చీకటి ఒప్పందం ప్రజలకు అర్థమైంది అని ఆమె వ్యాఖ్యానించారు. దుబ్బాక ఫలితమే గ్రేటర్ లో పునరావృతం కాబోతోంది అని ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: