ఏపీలో అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్ గా అడుగులు వేస్తుంది. పలు రంగాల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. విశాఖలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు ప్రోత్సాహాకాలు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  సిఫార్సుల మేరకు ప్రోత్సాహకాల ప్యాకేజీకి అనుమతి  ఇచ్చింది. డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం నిర్మాణాలకు విశాఖలోని మధుర వాడలో 130 ఎకరాలు కేటాయించింది. భూమి అప్పగించిన మూడేళ్ల లోపు కార్యకలాపాలు ప్రారంభించాలి అని ఉత్తర్వులు ఇచ్చింది.

ఏడేళ్ల లోపు నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కుకు 20 ఏళ్ల పాటు విద్యుత్ ప్రోత్సహాకాలు ఇస్తామని చెప్పింది. డేటా సెంటర్ లోని విద్యుత్, సమాచార, ఐటీ పరికరాల కోసం 100 శాతం ఎస్ జీఎస్టీ ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును కీలకమైన ప్రాజెక్టుగా గుర్తించి 24 గంటల పాటు నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. జాతీయ రహదారి 16కు అనుసంధానం కల్పించేలా ఇతర మౌలిక సదుపాయాలను అదానీ ఎంటర్ ప్రైజెస్ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసింది ఏపీ సర్కార్.  

ప్రాజెక్టు కోసం అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఏపీలోనే 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ ఎంటర్ ప్రైజెస్ కు అనుమతి ఇచ్చింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు చేయనున్న ఐటీ బిజినెస్ పార్కులో కేవలం ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ కోసం ఇచ్చిన భూమిలో ఎలాంటి నివాసాలూ ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. క పలు కంపెనీలను ఆకట్టుకునే విధంగా ఏపీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: