ప్రస్తుతం పాకిస్థాన్  విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుంది భారత్. ఓ వైపు భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడికక్కడ మట్టు పెట్టడంతో పాటు పాకిస్తాన్ సైనికులు ఏమాత్రం సరిహద్దులతో తోక జోడించినా  కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడంతో ఏకంగా పాకిస్తాన్ సరిహద్దు లోకి ఐదు కిలోమీటర్లు లోపలికి దూసుకు వెళ్ళిన భారత సైన్యం ఎడతెరిపి లేకుండా కాల్పులు జరపడంతో పాకిస్తాన్ వణికిపోయింది. అయితే భారత్లో విధ్వంసం సృష్టించి ఆనంద పడాలి అనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్కు భారత దీటుగా బదులిస్తోంది.




 అదేసమయంలో ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజల నుంచి కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది అనే విషయం తెలిసిందే. రోజురోజుకు ఉద్యమాలు  పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అదే సమయంలో పాకిస్థాన్కు సహాయం చేసే అన్ని దేశాలు కూడా దూరమవుతాయి. పాకిస్తాన్ వ్యవహార శైలితో కష్ట కాలంలో ఆర్థిక సహాయాన్ని అందించే సౌదీ అరేబియా కూడా పూర్తిగా దూరమైపోయింది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న భారత్  తమ వ్యూహాలకు మరింత పదును పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ సౌదీ అరేబియా ఎంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సౌదీ అరేబియా తో సరికొత్త సంప్రదింపులను భారత జరుపుతున్నట్లు ప్రస్తుతం వాదన వినిపిస్తోంది. కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం అని గుర్తిస్తూ.. పాక్  ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కు అప్పగించాలి అని సౌదీ అరేబియా డిమాండ్ చేసే విధంగా లేదా భారత్.. పిఓకే ని భారత్ లో కలుపుకొంటూ విడుదల చేసిన మ్యాప్ కి మద్దతు పలికే  విధంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సౌదీ అరేబియా ఇలా మద్దతు ప్రకటిస్తే అరబ్ దేశాలన్నీ మద్దతు చేయనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: