మెయిల్ ఆన్లైన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్ల నుండి బాడీగార్డు రస్సెల్ ఫ్లవర్స్తో అక్రమ సంబంధం నడుపుతోందని సమాచారం. వీరి సంబంధం గురించి ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2 మిలియన్ డాలర్ల నగదు అంటే మన లెక్క లో ఏకంగా రూ. 8,88,59,400. అంతేకాదు అతడికి బహుమతిగా 12 వేల డాలర్ల విలువైన వాచ్, అరుదైన షాట్గాన్ ఇచ్చినట్లు మెయిల్ ఆన్లైన్ వెల్లడించింది. అంతేకాదు వీరి అక్రమ సంబంధం గురించి రస్సెల్ భార్య మాట్లాడడం సంచలనంగా మారింది.
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.... మా పాలకుడి భార్య ‘హయా నా భర్తకు డబ్బు ఆశ చూపించి.. ఖరీదైన బహుమతులు ఇచ్చి ఆయన్ని వశపరచుకుంది.. తనని ఆమె దగ్గరే ఉండేలా చూసుకుంది’ అని... తనని తన భర్త సరిగా పట్టించుకోవడం లేదని... బాధను వ్యక్తం చేసింది. వీరిద్దరి బంధం గురించి ఆమెకు అర్థం కావడంతో.... రస్సెల్ భార్య తీవ్ర మనస్థాపానికి గురైందని.. వారి నాలుగేళ్ల వివాహ బంధాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకునేందుకు సిద్దమయ్యిందని మెయిల్ ఆన్లైన్ వెల్లడించింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తోంది.