ప్రస్తుతం దేశం మొత్తం ఆధునిక టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. ఒకప్పటి మూఢనమ్మకాలు ఎక్కడా కనిపించడం లేదు. మనిషిలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాల నెపం తో దారుణ ఘటన లు జరుగుతు  అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాలలో ప్రజలు అనాగరికం గానే వ్యవహరిస్తూ దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు తెరమీదికి వస్తూనే ఉన్నాయి  అన్న విషయం తెలిసిందే. మూఢనమ్మకాల నెపంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.



 మంత్రాల నెపంతో ఇప్పటికి ఎంతో మంది ప్రాణాలను తీసేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల మంత్రాల నెపంతో వ్యక్తిని దారుణంగా నరికి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం లో మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. తిర్యాని మండలం లో   ఆత్రం లచ్చు పటేల్... ఎప్పటిలాగే భోజనం చేసి రాత్రి పంట పొలంలో కాపలా కు వెళ్ళాడు. రాత్రి సమయంలో నిద్రిస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా అక్కడికి వచ్చి గొడ్డళ్ళతో అతనిపై దాడి చేయడం మొదలుపెట్టారూ.



 అతను నిద్ర మత్తులో నుంచి తేరుకునేలోపే దారుణంగా గొడ్డళ్ల తో మెడపైన నరికారు  ఆ తర్వాత శరీరమంతా దాడి చేశారు నరికారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు సదరు వ్యక్తి. సదరు వ్యక్తి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడిపోయి పొలం వద్దకు వెళ్లి చూడగా రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లచ్చు పటేల్ మంత్రాలు చేస్తున్నాడని నెపంతో బంధువులు ఊరికే అతని తో గొడవ పడేవారని వారే అతడిని హత్య చేసి ఉంటారు అని ప్రస్తుతం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: