ప్రస్తుతం దాదాపుగా ప్రయాణికులకు సరిపడే రైల్వే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే డిసెంబరు 1 నుంచి రైల్వే సర్వీసుల నిలిచిపోనున్నాయి... కరోనా వైరస్ కారణంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం రైలు సర్వీసులు అన్నింటిని నిలిపివేసేందుకు నిర్ణయించింది. ప్రయాణికులందరూ దీనిని తప్పకుండా గమనించాలి. అయితే ఇది చూసి ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటికే గతంలో నిలిచిపోయిన రైళ్లు సర్వీసులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే మళ్లీ రైలు సర్వీసులు నిలిచిపోవడమా అని ఆందోళన చెందారు.
కానీ అసలు విషయం ఏమిటి అన్నది మాత్రం పిఐబి తేల్చేసింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 1 తరువాత రైళ్లన్నీ నిలిచిపోయాయి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం అంటూ పిఐబి తేల్చేసింది. రైల్వే ప్రయాణికుల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేసింది. రైలు సర్వీసులు నిలిపివేత పై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు అంటూ స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణికుల ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని దేశంలో రైల్వే ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతాయి అంటూ స్పష్టం చేసింది పిఐబి.