ఇదెలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ విషయం బయటపడింది. ఈ టీకీ పరీక్షల్లో జరిగిన పొరబాటే దీనికి కారణం అని తెలిసింది. ప్రయోగంలో భాగంగా తొలిసారి ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వారిలో కొంత మందికి సగం డోస్ మాత్రమే ఇచ్చారట. ఇది పొరబాటున జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రెండోసారి టీకా ఇవ్వాల్సినప్పుడు ఫుల్ డోస్ ఇచ్చారట. ఇలా జరిగిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా కనిపించినట్లు వెల్లడైంది. రెండు సార్లు ఫుల్ డోస్ తీసుకున్న వారిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ఈ టీకా 62శాతం ప్రభావ వంతంగా పనిచేస్తుందని ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. కానీ తొలిసారి సగం డోస్ ఇచ్చి, రెండోసారి ఫుల్ డోస్ ఇస్తే 90శాతం ప్రభావ వంతంగా పనిచేస్తుందని వెల్లడైంది.
ఈ విషయం తెలిసిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. కానీ మొత్తానికి ఫలితంపై మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. ఈ పొరబాటు కూడా మనకు కలిసొచ్చినట్లే. ఈ విషయం తెలిసి.. అప్పుడప్పుడు మనం చేసే తప్పులు కూడా ఇలా కలిసొస్తాయని కొందరు నవ్వేస్తున్నారు. ఏదేమైనా మనకు కరోనా టీకా ఎంత అద్భుతంగా పని చేస్తే అంత మంచిది కదా. కాబట్టి ఈ పొరబాటు చేసిన వారిని క్షమించేయొచ్చు. లేదంటే ఎంత పెద్ద గొడవ చేసినా తక్కువే. కరోనా అంటే మాటలా మరి. ఈ విషయంలో మీరేమంటారు?