రాత్రి సమయంలో మహిళ తో కలిపి అర్ధరాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లిన గ్రానైట్ వ్యాపారి చివరికి ఉదయం దారుణ హత్యకు గురై విగతజీవిగా కనిపించిన నటన అందర్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన రంగనాథ్ కుటుంబం 35 ఏళ్ల కిందట ఖమ్మం వచ్చి స్థిరపడింది. గ్రానైట్ క్వారీ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు. కాగా ఇటీవల బంధువైన మహిళతో సూర్యాపేట అనంతగిరి మండలం లో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళాడు. ఇంతలో ఉన్నట్టుండి ముగ్గురు దుండగులు అక్కడికి చేరుకుని రంగనాథ్ పై మూకుమ్మడిగా దాడి చేశారు.
విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేయడంతో పక్కన ఉన్న మహిళ భయపడి పోయి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. రంగనాథ్ కూడా వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా అతనిని వెంబడించి మరి కర్రలతో కొట్టి చివరికి బండరాయితో తలపై మోది కిరాతకంగా హత్య చేశారు. మరుసటి రోజు శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా డాగ్ క్వాడ్ క్లూస్ టీం తో రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి వుంటుందని కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు..