గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా హత్య చేశాడు కిరాతకుడు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బార్డోలీ ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బార్డోలీ కి చెందిన మహిళ రష్మీ కటారియా గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు.. కాగా ఆమెకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు ఉండగా ప్రస్తుతం సదరు మహిళ గర్భవతి. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఇంటి సమీపంలో ఉండే చిరాక్ అనే వ్యక్తి సదరు ఒంటరి మహిళ పై కన్నేశాడు.
భర్తకు దూరంగా ఉంటుంది అని తెలుసుకుని మాయమాటలతో సదరు మహిళకు దగ్గరయ్యాడు. తోడుగా ఉంటానని నమ్మించాడు దీంతో గర్భవతి అయినప్పటికీ సదరు మహిళ అతనితో వివాహేతర సంబంధానికి తెరలేపింది. ఇటీవలే తన మూడేళ్ల కుమారుడు ఇంటివద్ద వదిలేసి ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్లింది సదరు మహిళ. మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చిరాగ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అన్ని నిజాలను కక్కేసాడు నిందితుడు. మహిళ తనతో సహజీవనం చేస్తోందని... ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో హత్య చేసినట్లు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.