ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు  రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడి పోతూ ఉండడంతో ప్రస్తుతం ఎన్నో ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం గర్భవతి ప్రాణాన్ని బలితీసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసుకున్న ఓ వ్యక్తి ఏకంగా మాయమాటలు చెప్పి... తోడుగా ఉంటాను అంటూ చెప్పి సదరు మహిళను లొంగదీసుకున్నాడు. చివరికి ఎన్నో రోజుల పాటు కామ కోరికలు తీర్చుకున్న  వ్యక్తి సదరు మహిళను దారుణంగా కడతేర్చిన ఘటన ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది.



 గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా హత్య చేశాడు  కిరాతకుడు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బార్డోలీ  ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బార్డోలీ  కి చెందిన మహిళ రష్మీ కటారియా  గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు.. కాగా ఆమెకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు ఉండగా ప్రస్తుతం సదరు మహిళ గర్భవతి. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఇంటి సమీపంలో ఉండే చిరాక్ అనే వ్యక్తి సదరు ఒంటరి మహిళ పై కన్నేశాడు.



 భర్తకు దూరంగా ఉంటుంది అని తెలుసుకుని మాయమాటలతో సదరు మహిళకు దగ్గరయ్యాడు.  తోడుగా ఉంటానని నమ్మించాడు దీంతో గర్భవతి అయినప్పటికీ సదరు మహిళ అతనితో వివాహేతర సంబంధానికి తెరలేపింది. ఇటీవలే తన మూడేళ్ల కుమారుడు ఇంటివద్ద వదిలేసి ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్లింది సదరు మహిళ. మహిళ కనిపించకపోవడంతో  కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చిరాగ్  అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అన్ని నిజాలను కక్కేసాడు నిందితుడు. మహిళ తనతో  సహజీవనం చేస్తోందని... ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో హత్య చేసినట్లు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: