బంధువుల ఇంటికి పెళ్లి వేడుక కోసం వచ్చిన ఆ దంపతులు తమ దొంగ బుద్దిని చూపించారు .. చివరికి ఆ బంధువుల చేతిలోనే దెబ్బలు తిన్నారు .. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లో జరిగింది .. పెళ్లి వేడుకల భాగంగా వధువు ఇంటికి వచ్చిన ఆ  దంపతులు అక్కడ ఉన్న ఆభరణాలపై వీరి కన్ను పడింది .. బంగారం చూస్తే ఎవరికి ముచ్చట వేస్తుంది .. కానీ వీరికి మాత్రం దొంగతనం చేయాలనీ ఆశ కలిగింది..  ఆ ఆశే వారిని  పోలీస్  స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది .. పెళ్ళికి అని వచ్చి ఇలాంటి పనులు  చేయడమేంటి అని బంధువులంతా ప్రశ్నిస్తున్నారు .. వివరాలలోకి వెళ్తే ,

కామారెడ్డి జిల్లా  రోజురోజుకి ఎదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తుంది .. మొన్నటికి మొన్న బకెట్ లో బాలుడు మృతి అనే వార్తతో ,ఇప్పుడు పెళ్లి వేడుకలో దొంగతనం అనే వార్తతో ప్రతి రోజు వార్తల్లోకి ఎక్కుతుంది .. జిల్లాలో రోజురోజుకు  సంఘటనలు పెరుగుతున్నాయి .. కామారెడ్డి లోని అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో దొంగతనం జరిగింది ..వధువు బంధువుల యొక్క  బంగారం చోరీ జరిగింది. బంగారం చోరీ జరగడంతో మండపం లో పెళ్లి ఆగిపోయింది ..కొద్దీ సేపు అంత మండపం లో గందర గోళం ఏర్పడింది .. అయితే దొంగగతనం చేసేటపుడు అక్కడి బంధువులు చూడడం తో ఆ దంపతులని  గమనించగా  దొంగలించిన బంగారం దొరకడంతో అక్కడ ఉన్నవారు  వాళ్ళని  చితకొట్టారు ..

అనంతరం వారిని బంధువులు  పోలీసులకి అప్పగించారు..  పోలీసులు వారి గురించి తెలుసుకోగా ఆ దంపతుల పేర్లు  పరమేష్ మరియు యశోద లుగా బయటపడ్డాయి .. ఆ దంపతులు దగ్గర్లోని కాలనీ లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది ... దొంగతనం చేసినందుకు గాను పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు ..




 

మరింత సమాచారం తెలుసుకోండి: