వరద సాయం కేసీఆర్ పదివేలు ప్రకటించగా బీజేపీ 25 ,000 ప్రకటించింది.. కానీ కాంగ్రెస్ వరద సాయాన్ని యాభై వీలుగా ప్రకటించింది. అంతేకాదు ళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు సాయం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చేశారు.అంతేకాదు ఎంఎంటీఎస్ రైళ్లలో వికలాంగులకు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. ఇంకా మెట్రో రైలు పాతబస్తీ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించే విధంగా పనిచేశామని ప్రకటించింది.
ఇంకా ఈ మేనిఫెస్టో లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్పించడం.. కార్పొరేట్ విద్యా సంస్థలల్లో ఫీజులను నియంత్రించడం లాంటి హామీలు కూడా ఉన్నాయి.100 యూనిట్లలోపు గృహవినియోగదారులకు విద్యుత్ రాయితీ ప్రకటించారు. వరదల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వరద రహిత హైదరాబాద్ కోసం జపాన్, జర్మనీ టెక్నాలజీ తీసుకొస్తామన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి.. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు చేస్తామన్నారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు చూస్తుంటే కాంగ్రెస్ అరచేతిలో ఆకాశం చూపిస్తున్నట్లు ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని ఏవిధంగా ఈ హామీలకు నిధులు సమకూరుస్తుందో చూడాలి..