దేశవ్యాప్తంగా
బీజేపీ లో ఉన్న అగ్రనేతలందరి గ్రేటర్ లో మోహరించేందుకు
బిజెపి గట్టిగానే కసరత్తు చేస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ను విజయం వైపు నడిపించిన, భూపేంద్ర యాదవ్ ను గ్రేటర్ ఎన్నికల ఇన్చార్జిగా నియమించింది.
కేంద్ర మంత్రులను గ్రేటర్ లో ప్రచారానికి దింపాలి అని
బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. రెండు రోజుల క్రితమే గ్రేటర్ లో ప్రచారం చేసేందుకు వచ్చిన
ప్రకాష్ జవదేకర్ కేసీఆర్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఛార్జిషీట్ విడుదల చేశారు. అలాగే బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు బెంగళూరు
ఎంపీ తేజస్వి
సూర్య కూడా గ్రేటర్ లోనే ప్రస్తుతం పర్యటిస్తున్నారు.