డబ్బు మనిషిని ఎలా మారుస్తుంది అంటే డబ్బు వస్తుందని అంటే ఎంత నిచానికి అయిన పాల్పడుతున్నారు. అలాంటి కలికాలం అయ్యింది. ఆస్తి కోసం సొంత వాళ్ళనే మోసం చేయడం తో పాటుగా దారుణంగా అంత మొందిస్తున్నారు.. ఇప్పుడు జరిగిన ఘటన కూడా అలాంటిదే.. ఆస్తి కోసం సొంత బావ మరిదినే ఓ మూర్ఖుడు దారుణంగా చంపేశాడు.. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. కొడుకు జాడ తెలియక పోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. దాంతో అసలు వ్యవహారం బయటపడింది.. 



వివరాలల్లోకి వెళితే .. ఈ దారుణం కృష్ణా జిల్లా లో జరిగింది.పెడనకి చెందిన మహంతి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం బల రామునిపేటకి చెందిన వీరబాబు బావాబావమరుదులు. వీరబాబుకి భార్యాపిల్లలు లేరు. తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి కలసివచ్చింది. భార్యాబిడ్డలు లేని బావమరిదికి ఆస్తి రావడం తో బావలో అత్యాశ మొదలైంది. ఒంటరి అయిన బావ మరిదిని అంతమొందిస్తే ఆస్తి కాజేయొచ్చని పథకం వేశాడు... అయితే ఎప్పటిలాగే ఫోన్ చేసి మందు పార్టీ చేసుకుందామని ఫోన్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి రమ్మని చెప్పాడు.. బావ మాటలు నమ్మిన అతను అలానే పార్టీకి వెళ్ళాడు..
 


నవంబర్ 20న పెడన వచ్చాడు. మద్యం తాగుదామంటూ వీరబాబుని ఇసుకపర్ర డ్రైన్ వంతెన వద్దకు తీసుకెళ్లాడు. తన బంధువు గంగాధరరావుతో కలసి బావమరిది వీరబాబు మెడకు ఉరి బిగించి దారుణంగా చంపేశాడు. అనంతరం శవాన్ని అక్కడే డ్రైన్‌లో పడేసి వెళ్లిపోయారు. రెండురోజులైనా తన కొడుకు రాలేదని కంగారుపడిన వీరబాబు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కొడుకు కనపడడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. పోలీసుల స్టయిల్లో విచారణ చేపట్టారు.. దీంతో బావ గారు.. అసలు గుట్టును బయట పెట్టారు.. కథ సుఖాంతం అయ్యింది..


మరింత సమాచారం తెలుసుకోండి: