మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసేందుకు తల్లి దండ్రులు సిద్ధ మయ్యారు.. బంధుమిత్రులు అందరూ ప్రస్తుతం పెళ్లి ఇంటికి చేరుకుంటున్నారు యువతి కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయింది. కానీ ఇంతలో ఊహించని ఘటన తో విషాదం నిండి పోయింది. ఏకంగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ప్రియుడు యువతిని దారుణంగా హతమార్చిన ఘటన అందరిని ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చి స్థానికంగా కలకలం సృష్టించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.


 వివరాల్లోకి వెళితే షాహిని  బేగం అనే 19 ఏళ్ల యువతి రఘు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పేందుకు ధైర్యం లేక పోవడంతో సైలెంట్ గానే ఉండిపోయారు  అయితే ఇటీవలే ఈ ఇద్దరికీ కూడా పెద్దలు వేర్వేరుగా పెళ్ళి నిశ్చయించారు. ఈ క్రమంలోనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయినా ఈ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఓ చోట కలిసారూ   రఘు పురుగుల మందు తాగాడు ఆ తర్వాత మాత్రం యువతి పురుగుల మందు తాగేందుకు భయపడి తాగలేదు.



 ఇక గమనించిన స్థానికులు రఘుని ఆసుపత్రికి తరలించగా ఆ తర్వాత కోలుకున్నాడు రఘు. దీంతో మళ్లీ సదరు యువతిని కలిశాడు. ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఆత్మహత్యకు సహకరించకుండా మరొకరితో పెళ్లికి సిద్ధం కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన రఘు  ఏకంగా మాట్లాడాలని బయటికి రప్పించి దారుణంగా హతమార్చాడు. ఇక యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు రఘును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. సదరు యువతిని హత్యచేసి కాలువలో పడేసినట్లు తెలపడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: