ఇటీవలే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అయోధ్య నగర్ లో దివంగత నేత చంద్ర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జీడిమెట్ల 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి ఇటీవలే ప్రచారం నిర్వహించారు. అంతే కాకుండా ఆమెతో కలిసి యువ నాయకులు భరత సింహారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రజల ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా 132 వ డివిజన్ లో గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదు అంటూ ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి తార చంద్ర రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఇక మరో సారి టిఆర్ఎస్ కు ఓటు వేసి ప్రజలందరూ మోసపోవద్దని బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలందరినీ కోరారు 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకు తారా చంద్రా రెడ్డి. ప్రస్తుతం 132 వ డివిజన్ లో ఎక్కడ చూసినా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని.. ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చారు 132 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి.