అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్న  విషయం తెలిసిందే.   అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన జగన్ ఇప్పుడు వరకు కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త పథకాలతో ముందుకు సాగుతూ ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తుంది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్.., ప్రజలందరికీ ఆర్థిక ఇబ్బందులు తొలగించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.


 ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇటీవలే కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో ఆర్థికంగా చితికిపోయిన చిరు వ్యాపారులను ఆదుకునే కీలక నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ సంక్షోభం కారణంగా చిరువ్యాపారులు కనీసం ఉపాధి లేక ఆర్థికంగా ఎంతగానో చితికిపోయారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి వారికి ఎలాంటి వడ్డీ లేని రుణాలను అందించేందుకు జగన్మోహన్ రెడ్డి  సర్కార్ నిర్ణయించింది. వీధుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వడ్డీ లేకుండా పదివేల వరకు రుణం అందించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది.



 ఇక నేడు జగనన్న తోడు అనే పథకాన్ని ప్రారంభించనుంది  జగన్ సర్కార్ ఈ పథకంలో భాగంగా 9.05 లక్షల మంది లబ్ధిదారులకు వడ్డీ లేకుండానే పదివేల లోన్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది.  కాగా నేడు సీఎం జగన్ ప్రారంభించనున్న జగనన్న తోడు పథకం లో భాగంగా పది వేలు రాని వారు వెంటనే... వార్డు  లేదా సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.  ఇక వారు ఇచ్చిన పత్రాలను పరిశీలించిన తరువాత వారు అర్హులు అయ్యి  ఉంటే నెల రోజుల్లో వారికి వడ్డీలేని రుణాలు అందుతాయి.  అర్హులు అయి ఉండి  జాబితాలో పేరు లేని వారు వెంటనే సహాయం కోసం 1902 కి కాల్ చేసి కనుక్కో వలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: