హైదరాబాద్ లో ఎన్నికల వేడి మొదలైన సంగతి తెలిసిందే.. నగరం మొత్తం ఎన్నికల బరిలో హుషారుగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడిక్కడ రాజకీయ నేతలు హోరా హోరీగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అధికార పార్టీ టీఆరెఎస్ పార్టీ నేతలు , కార్యకర్తలు ఇప్పటికే ప్రచారంలో జోరును పెంచారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రచారానికి వెళ్ళిన నేతల పై ఎదురు దాడులు చేస్తున్నారు. అయినా వెనకడుగు వెయ్యకుండా ముందుకు సాగుతున్నారు.



 కేసీఆర్, కేటీఆర్ లు ప్రచారంలో జోరును పెంచారు.  ర్యాలీలు , రోడ్ షో లు నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన దుబ్బాక ఎన్నికల తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం సినీ పరిశ్రమలకు సరి కొత్త వరాలను అందిస్తూ ఆకర్షిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో లో కొన్ని నిర్ణయాలను కూడా పొందుపరిచారు. వాటికి తగ్గట్లుగా అన్నీ చర్యలను చేపడుతూ ముందుకు సాగుతున్నారు. తెరాస నాయకులు బిజేపికి ఎక్కడా ఇసుమంత ఛాన్స్ కూడా ఇవ్వకుండా ప్రజలను ఆకర్షించడానికి ర్యాలీలు నిర్వహిస్తున్నారు.



ఈ మేరకు సంగారెడ్డి భారతి నగర్ కు చెందిన సింధు ఆదర్శ్ రెడ్డి కి మద్దతు తెలపాలని టీఆరెఎస్ మద్దతు రోడ్ షో ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు..ఎంపి ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.. ప్రజలు అభివృద్ధిని కోరుకోవాలి.టీఆరెఎస్ పార్టీని గెలిపించాలని నగరంలోని తెరాస నేతలు టీఆరెఎస్ జెండాల తో బైక్ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ది వైపు అడుగులు వేద్దాం అని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున తెరాస నేతలు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ర్యాలీ కొద్ది సేపు రసాభాసగా మారింది.. ఈ ఎన్నికల్లో టీఆరెఎస్ గెలుపు ఖాయమని నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: