తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేడి విపరీతంగా రాజుకుందని చెప్పాలి. ఎక్కడికక్కడ పార్టీల అభ్యర్థులు తమను గెలిపించాలని ఓటర్ల వెంటపడుతున్నారు. దాదాపు అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ పార్టీల అగ్రశ్రేణి నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనక తప్పడం లేదు. ఇది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కాకుండా ఏదో అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే దాదాపు టిఆర్ఎస్ లోని అగ్రశ్రేణి నాయకులందరూ ఏదో ఒక చోట ప్రచారంలో ఉన్నారు.

టీఆర్ఎస్ కు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేని ఒక్కో డివిజన్ కు కేటాయించింది. ఆయా డివిజన్లలో ఎమ్మెల్యేలు అభ్యర్థులతో పాటు ప్రచారం చేస్తూ తమ పార్టీకి ఓటు వేస్తే ఈ సారి హైదరాబాద్ ని మరింత అభివృద్ధి చేస్తామంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ కి చెందిన టిఆర్ఎస్ అభ్యర్థి కాజా సత్యనారాయణ తరఫున ఆ పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లు దివాకర రావు ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఎన్నికల నేపథ్యంలో నిన్న రాత్రి వివేకానంద నగర్ లో టిఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న కాజా సూర్యనారాయణని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ఇంచార్జి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ప్రచారం నిర్వహించారు. నిన్న జూబ్లీహిల్స్ డివిజన్ లోని ఇందీరానగర్ లో టిఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న కాజా సూర్యనారాయణని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ఇంచార్జి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: